నటకిరీటి రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం". యాపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డీవై జగన్ మోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఏ కథను ఏ కంచి చేర్చాలో ... అనే ఈ సోల్ సాంగ్ ను హరిణి ఆలపించారు. మధుకిరణ్ మద్దికుంట సాహిత్యం అందించారు.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.