అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఉర్వశివో రాక్షసివో". ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య హార్ట్ టచింగ్ డ్యూయెట్ సాంగ్ లా చిత్రీకరించిన ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. అచ్చు రాజమణి స్వరపరిచిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించారు.
రాకేష్ శశి డైరెక్షన్లో నేటి తరం ఆధునిక ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
అల్లు అరవింద్ సమర్పణలో, ధీరజ్ మొగిలినేని, విజయ్ M ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.