కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 450 కోట్లకు పైగా వసూలు చేసిందని మూవీ మేకర్స్ ఈరోజు వెల్లడించారు. ఇప్పటికీ ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది