టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ ను అందించే నిర్మాణ సంస్థలో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఆ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం "రాజమండ్రి రోజ్ మిల్క్". నాని బండ్రెడ్డి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో . జై జాస్తి , అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10:20 నిమిషాలకు రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్ రిలీజ్ కాబోతుందని పేర్కొంటూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఇంట్రోయూప్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ లపై ప్రదీప్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత్, యశ్వంత్ నాగ్, భరత్ సౌరభ్, అజయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.