పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజా అప్డేట్ ప్రకారం, కార్తీ సర్దార్ విడుదలైన నాలుగో రోజులకే నైజాంలో 72 లక్షలు వసూలు చేసింది అని సమచారం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో రాశి ఖన్నా, రజిషా విజయన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విలన్గా చుంకీ పాండే నటించాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
![]() |
![]() |