ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ బోర్డ్‌కి లీగల్ నోటీసులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 24, 2019, 08:07 PM

ఆర్జీవీ దెబ్బకు ఎరక్కపోయి ఇరుక్కుపోయారా?  ఆయన ప్రచారాల ఆర్భాటం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాతలకు తల బొప్పి కట్టిస్తోందా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇప్పటికే వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదం రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ రిలీజ్ చేసిన వెన్నుపోటు సాంగ్ చిత్రయూనిట్ ని ముప్పు తిప్పలకు గురి చేస్తోంది. ఈ పాటలో ఏపీ సీఎం చంద్రబాబును విలన్ గా చూపించారు వర్మ. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది అల్లుడు చంద్రబాబే అంటూ పాటలో ఎలివేట్ చేశారు. దీంతో వర్మపై పలువురు కేసులు వేశారు. కోర్టులో ఈ కేసు పరిశీలనకు వెళ్లింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఏకంగా ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ కే లీగల్ నోటీసులు పంపించడం సంచలనమైంది. బోర్డ్ చైర్మన్ సహా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డికి నోటీసులు పంపారట. తూ.గో జిల్లాకు చెందిన ఎస్.వి.ఎస్.ఎన్ అనే పిటిషనర్ ఈ కేసును సీరియస్ గా హ్యాండిల్ చేస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తొలిగా సెన్సార్ బోర్డ్, చిత్రనిర్మాతలకు నోటీసులు పంపడంతో ఫిలింవర్గాల్లో ఇది వేడి పెంచుతోంది. మూడు వారాల్లోగా ఈ కేసు విషయమై పూర్వాపరాల్ని పరిశీలించాలని అధికారుల్ని కోర్టు కోరింది. ప్రస్తుతం గొడవ ముదిరిపాకాన పడింది. మరోవైపు కె.ఎ.పాల్ వంటి వారిపై ఆర్జీవీ ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపైనా టీవీ చానెళ్లలో డిబేట్ రన్ అవుతోంది. ఆర్జీవీ ఈ ప్రమాదాలన్నిటినీ ఎలా డీల్ చేస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa