మహేశ్ కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్న వేళ.. ఏపీలో జరిగే అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అన్న అంశంపై చాలానే వాదనలు జరుగుతున్నాయి. మహేశ్ నోరు విప్పి ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. కానీ.. జరుగుతున్న పరిణామాలతో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి. సొంత బావతో పాటు.. తన తండ్రి సోదరుడు సైతం ఇటీవల టీడీపీలో చేరిపోవటంతో.. ఈసారి ఎన్నికల ప్రచారంలో మహేశ్ ఎంట్రీ పక్కా అన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అభిమానుల్లో జరుగుతున్న ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టేలా మహేశ్ సతీమణి నమత్ర సమాధానం చెప్పారు.
ఒక మీడియాలో మాట్లాడిన సందర్భంగా నమ్రత మహేశ్ బాబు రాజకీయ ప్రచారంపై స్పష్టతను ఇచ్చారు. మహేశ్ తన దగ్గరే రాజకీయాల గురించి మాట్లాడరని.. అలాంటప్పుడు వేదికలెక్కి ప్రసంగాలు ఎక్కడ ఇవ్వగలరంటూ సమాధానం ఇచ్చారు. తన భర్త సినిమాలతో బిజీగా ఉన్నారని.. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదని నమత్ర క్లారిటీ ఇచ్చారు.రాజకీయాలతో సంబంధం లేని నటుల్లో మహేశ్ ఒకరి.. ఆయనకు సమయం లేదని.. ఏ మాత్రం టైం చిక్కినా కుటుంబం కోసం కేటాయిస్తారే తప్పించి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరన్నారు. రాజకీయాలతో మహేశ్ కు సంబందం లేదని.. ఆయన రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటారని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినంత మాత్రాన ఆయన రాజకీయ వేత్త అయిపోరన్న నమ్రత.. తనతోనే రాజకీయాల గురించి సరిగా మాట్లాడరని.. అలాంటిది స్పీచ్ లు ఎక్కడ ఇస్తారని ప్రశ్నించారు. సో.. రీల్ లో పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు చెప్పిన మహేశ్ రియల్ లో మాత్రం అలాంటివి సాధ్యం కాదన్న మాటను నమ్రత ఎంత సింఫుల్ గా తేల్చేశారో కదూ!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa