చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలను టాలీవుడ్ సినిమాలు, నటీనటులకు అవార్డులు అందజేశారు. ఉత్తమ చిత్రం అవార్డును ‘మహానటి’ సినిమా కైవసం చేసుకోగా, సంచలనాత్మక చిత్రంగా ‘రంగస్థలం’ నిలచింది. ‘గీత గోవిందం’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డును విజయ్ దేవరకొండ అందుకోగా . ఇక ‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు అందుకున్నారు ‘రంగస్థలం’లో నటనకు గాను సమంతకు ప్రత్యేక అవార్డును అందజేశారు. ఉత్తమ తొలిపరిచయ నటిగా రష్మిక మందన అవార్డు అందకున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంలో నటనకు గాను రాశీ ఖన్నాను స్పెషల్ జ్యూరీ అవార్డును ఇచ్చారు. ఉత్తమ హాస్యనటి అవార్డును విద్యుల్లేఖ రామన్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు, మహిళ రత్న పురస్కారాలు, సినీ, పారిశ్రామికరంగాల్లో పేరు పొందిన ప్రముఖుల ఉపన్యాసాలు, సత్కారాలతోపాటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు అతివైభవంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, పంచాంగ పఠనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీకళాసుధ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ అందరికీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫీనిక్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశిష్ట దాత, రిపబ్లిక్ ఆఫ్ కొరియా హానరరీ కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) సురేష్ చుక్కపల్లి, విశిష్ట అతిధిగా వ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు కరుణా గోపాల్, గౌరవ అతిధిగా గానకోకిల, పద్మభూషణ్ పి. సుశీల, ప్రత్యేక ఆహ్వానితులుగా నెక్ట్వేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఎన్.టి. చౌదరి, మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa