ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉప్పు కప్పురంబు' కథ ఏంటో చూసేద్దాం రండి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 09:33 AM

కీర్తి సురేశ్ - సుహాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'ఉప్పు కప్పురంబు'. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాణం ఎప్పుడు మొదలైంది .. ఎప్పుడు పూర్తయింది అనేది చాలామందికి తెలియదు. 28 రోజులలోనే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, నేరుగా 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది.  ఈ సినిమాలోని కథను ఒకసారి పరిచయం చేసుకుందాం.


కథ: ఈ కథ 1992లో  జరుగుతూ ఉంటుంది. అది 'చిట్టి జయపురం' అనే ఊరు. ఆ గ్రామానికి సుబ్బరాజు (శుభలేఖ సుధాకర్) పెద్ద మనిషి. ఆయన కూతురే అపూర్వ (కీర్తి సురేశ్). ఒక రోజున హఠాత్తుగా సుబ్బరాజు చనిపోతాడు. గ్రామస్తులంతా కలిసి ఆయనను ఖననం చేస్తారు. ఆయన వారసురాలిగా .. ఊరు పెద్దగా అపూర్వ వ్యవహరించాలని కోరతారు. ఇష్టం లేకపోయినా అందుకు ఆమె ఒప్పుకుంటుంది. అయితే ఆ గ్రామపెద్దగా పెత్తనం చేయాలనే కోరిక భీమయ్య (బాబూ మోహన్) మధుబాబు (శత్రు)కి బలంగా ఉంటుంది. అందువలన అనుభవం లేని అపూర్వను కంగారుపెట్టేసి, ఆమె నుంచి ఆ కుర్చీని లాక్కోవాలని చూస్తుంటారు. ఆ గ్రామానికి సంబంధించిన స్మశానంలో చిన్నా (సుహాస్) పనిచేస్తూ ఉంటాడు. తన తల్లి కొండమ్మ ( తాళ్లూరి రామేశ్వరి)తో కలిసి అతను ఆ స్మశానం పక్కనే గుడిసె వేసుకుని జీవిస్తూ ఉంటాడు. స్మశానానికి సంబంధించిన ప్రదేశంలో ఇంకో నలుగురికి మాత్రమే చోటు ఉందనీ, ఆ తరువాత నుంచి అక్కడ ఎవరినీ ఖననం చేయడానికి అవకాశం ఉండదని అతను అపూర్వకి చెబుతాడు. తాను ఎప్పుడు చనిపోయినా తన గ్రామంలోనే ఖననం జరగాలని భీమయ్య, తన తండ్రి చనిపోతే ఆ గ్రామంలోనే పూడ్చాలని మధుబాబు పట్టుపడతారు. తన తల్లి కొండమ్మ చివరి కోరిక కూడా అదేనని అపూర్వతో చిన్నా చెబుతాడు. అప్పుడు అపూర్వ ఏం చేస్తుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa