తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్తో తనకు ప్రాణహానీ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ తనను టార్గెట్ చేశారని కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ తీరుతో కాంగ్రెస్లో తన సామాజికవర్గమైన మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొన్ని రోజులుగా మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో మాదిగలు 50 ఏళ్లు వెనక్కి వెళ్లారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రేవంత్ అంటే ఏంటో ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి అక్రమంగా కోట్లు సంపాదించిన వ్యక్తి రేవంత్ అని మోత్కుపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాల్లో 3 టికెట్లను కాంగ్రెస్ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని ఫైరయ్యారు. మాల కంటే మెజార్టీ జనాభా ఉన్నా తన మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా కేటాయించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే మాదిగలకు టికెట్ దక్కలేదని మండిపడుతున్నారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని మోత్కుపల్లి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa