గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన దండవెని నాగరాణి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 30 వేల చెక్కు ను గ్రామ శాఖ అధ్యక్షుడు అంజాగౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది,ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి విద్యా వైద్యం చాలా ముఖ్యమైన వని తెలిపారు.
అనారోగ్య బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి అండగా నిలబడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహాయ నిధి నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు చెక్కులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని మరుగున పడేసిందని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను రెండు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిందని ఆరోగ్యశ్రీలో ఇదివరకు లేని 160 కి పైగా కొత్త రోగాలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలను అందించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు ...
ఈ చెక్కు మంజూరు కావడంలో కృషిచేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు అంజా గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్ అనిల్ గౌడ్ అస్లాం పిఎసిఎస్ డైరెక్టర్ అంజిరెడ్డి మాజీ ఎంపిటిసి పరుశరాములు నియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి అంజయ్య పిట్ల వెంకటి మహమ్మద్ ఆజాద్ జంగం కుమ్మరి శంకర్ రాజు పెద్దూరి విట్టల్ గౌడ్ సోను తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa