ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై జరిగే దాడులను ఖండించండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 03:29 PM

మహిళలపై జరిగే దాడులను ఖండించాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు ప్రభంజనం డిమాండ్ చేశారు.పట్టణంలోని కళాశాల విద్యార్థులతో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మహిళలపై నేటికి రక్షణ కరువైందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో మెడికల్ విద్యార్థినిపై హత్యాచార ఘటనను తీవ్రంగా నిరసించారు.
మెడికొ విద్యార్థిని అత్యాచార ఘటన దురదృష్టకరమన్నారు. ఇప్పటికీ నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని తెలిపారు. మెడికో విద్యార్థినిపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు శ్రీనివాస్, అరుణ్ యాదవ్, రఫిక్, ఇర్ఫాన్, షేక్ రఫీ, నరేష్, సాయిరాం, మంజునాథ్, స్వామి,  కుమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa