హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని తోటి సహోద్యోగులే హత్య చేశారు. మద్యం మత్తులో ఈత కొలనులో తోసేసి చంపేశారు. ఈత రాదని ప్రధేయపడినా వినిపించుకోకుండా నీటిలో తోసేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు మద్యం పార్టీలో ఎంజాయ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్ణణం మారుతీ నగర్కు చెందిన గజబింకల్ అజయ్ తేజ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గత కొంత కాలంగా పని చేస్తున్నాడు. తమ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ శ్రీకాంత్ పుట్టిన రోజు సెలబ్రేషన్లో భాగంగా సెప్టెంబర్ 1న మద్యం పార్టీ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయటం, పుట్టినరోజు ఉండటంతో వారం రోజుల ముందే పార్టీకి ప్లాన్ చేశాడు. ఘట్కేసర్ మండల పరిధిలోని ఘనపూర్లోని ఓ గెస్ట్హౌస్ను పార్టీ కోసం బుక్ చేశాడు.
ఈ పార్టీకి అజయ్ తేజతోపాటు దాదాపు 20 మంది కొలీగ్స్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో గెస్ట్ హౌజ్కు చేరకుున్నారు. మెుత్తం ఉద్యోగుల్లో 13 మంది మహిళలు కూడా ఉన్నారు. అక్కడ పీకల దాకా మద్యం సేవించారు. అనంతరం రాత్రి 12 గంటల తర్వాత శ్రీకాంత్చే కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. అరగంట అనంతరం మద్యం మత్తులో అజయ్ తేజ్ స్నేహితులు సాయి కుమార్, రంజిత్ రెడ్డి అతడిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. గెస్ట్ హౌజ్లోని ఈత కొలనులో తోసేసేందుకు ప్రయత్నించారు. అయినా వినిపించుకోకుండా మద్యం మత్తులో అజయ్ను స్విమ్మింగ్ పూల్లో తోసేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ జరిగే ప్రాంతానికి వెళ్లి మ్యూజిక్ సిస్టం ఆనే చేసి డ్యాన్స్ చేశారు. దాదాపు 40 నిమిషా తర్వాత పార్టీకి హాజరైన ఓ సహోద్యోగి అజయ్ కనిపించటం లేదని గుర్తించి టీమ్ లీడర్ శ్రీకాంత్కు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి గెస్ట్ హౌస్ పరిసరాలను వెతగ్గా.. స్విమ్మింగ్ ఫూల్లో తేలుతూ కనిపించాడు. దీంతో అతడిని బయటకు తీసి వెంటనే హాస్పిటల్ తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
దీంతో సమాచారం పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. మృతుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా.. తోటి ఉద్యోగులు, స్నేహితులైన రంజి త్రెడ్డి, సాయి కుమార్ కావాలనే కొలనులో తోసేసినట్లు తేలింది. ఆఫీసులో వర్క్ విషయంలో జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకొని పార్టీలో అతడిని కొలనులోకి తోసేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిద్దరీతో పాటు అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసిన టీమ్ లీడర్ శ్రీకాంత్, మద్యం పార్టీకి గెస్ట్హౌస్ను ఇచ్చిన నిర్వాహకుడు వెంకటేశ్లపై అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa