ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:13 PM

హైడ్రాపై చట్టబద్ధంగా పోరాటం చేద్దామని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మౌలాలీ డివిజన్ శివనంద్ నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిశారు. కొన్నేళ్ల క్రితం శివానంద నగర్లో అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్నామని దానికి ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసిందని వాపోయారు. న్యాయ నిపుణులతో సూచనలు తీసుకుని ముందుకెళదామని, పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa