ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల గణన మరియు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2024, 03:52 PM

అక్బర్ పేట-భుంపల్లి మండలం అక్బర్ పేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కులగణన కార్యక్రమంలో  సంబంధిత అదిక్కారులతో  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీసీ కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే కు ప్రజలంతా అధికారులకు పూర్తి సమాచారము ఇచ్చి సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, ఎమ్మార్వో చంద్రశేఖర్ పంపరి, ఎంఈఓ ఆంజనేయులు గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వంశీ, గ్రామ ఏన్యూమరేటర్ మహేందర్ రెడ్డి, వివిధ శాఖ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్తే వెంకటేశం, కూతురి సుమలత, కూతురి చందు, మంద చంద్రసాగర్, గుండా శంకర్,పాతూరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa