ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 80 ఎక్స్‌ట్రా టోల్ వసూలు.. రూ. 35 వేల ఫైన్, ఎంత పనైపాయే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 07:34 PM

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డు పై టోల్ వసూలు చేసిన ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్, హెచ్ఎండీఏకు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 షాక్ ఇచ్చింది. రూ.80 అధిక టోల్‌ ఛార్జీ వసూలు చేసినందుకు మెుట్టికాయలు వేసింది. ఫిర్యాదుదారుడికి రూ.30 వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు.. మెుత్తంగా రూ.35 వేలు చెల్లించాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఆ మెుత్తాన్ని చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ రామంతాపూర్‌ సుచిత్రనగర్‌ కాలనీకి చెందిన రాజ్‌ కుమార్‌ అనే న్యాయవాది 2023 నవంబరు 11న రాత్రి 8 గంటలకు ఓఆర్‌ఆర్‌పై ప్రయాణం చేశారు.


  ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డు పైకి ప్రవేశించిన రాజ్ కుమార్.. కీసర నుంచి బయటకు వచ్చారు. దీంతో టోల్ ఫీజు కింద మొత్తం రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేసారు. ఆ తర్వాత ప్రతివాద సంస్థ తిరుగు ప్రయాణంలో కీసర నుంచి ఘట్‌కేసర్‌కు వెళ్లగా రూ.90 వసూలు చేశారు. టోల్ ఛార్జీ ధరల ప్రకారం.. రూ.10 టోల్‌ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. అయిదే రూ. 10 కాకుండా అదనంగా అదనంగా రూ.80 మెుత్తంగా రూ. 90 వసూలు చేశారు. దీంతో రాజ్ కుమార్ ఓఆర్‌ఆర్‌ టోల్‌ఫ్రీ నంబరు 14449కు కాల్ చేశారు. అయితే అది మనుగడలో లేకపోటవంతో ఎటువంటి స్పందన రాలేదు.


ఫాస్టాగ్‌ తీసుకున్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే కారణాలు చెప్పకుండా ఆయన ఫిర్యాదును వారు తిరస్కరించారు. దీంతో రాజ్ కుమార్ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. టోల్ సంస్థ అదనపు డబ్బులు వసూలు చేసారని ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్‌ టోల్‌ నిర్వహణ సంస్థ ఆర్అండ్ బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే పైవేట్‌ లిమిటెడ్, హెచ్ఎండీఏ అధికారులను మందలించింది. ఫిర్యాదుదారుడికి సంయుక్తంగా రూ.35 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పట్ల ఫిర్యాదు దారుడు రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa