ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్ డేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 12:35 PM

 తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్ డేట్ వెలువడింది. ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చే ఛానస్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.త్వరలో బీసీ కమిషన్ నివేదికను సమర్పించనుండగా..ఆ తర్వాత మంత్రివర్గం భేటీలో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు
రాష్ట్రంలో జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి స్కీములు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేస్తి త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది.నివేదికపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో కమిషన్ నివేదికను ఆమోదించి ఆ తర్వాత హైకోర్టుకు సమర్పించే ఛాన్స్ ఉంది. మరోవైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బీసీ కమిషన్ నివేదికపై చర్చించి రిజర్వేషన్లపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పంపించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోందట. మొత్తంగా ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa