ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులగణన సర్వే పేపర్లను తగలబెట్టిన తీన్మార్ మల్లన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 07:57 PM

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారని సీఎం తెలిపారు.అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికతప్పులతడక గా ఉందంటూ బీసీ కులసంఘాలు సర్వే నివేదికను చించి చెత్త బుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశాయి.ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే నివేదికను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తగలబెట్టమని..ఇదొక తప్పుల తడక అని చెప్పడం కులగణన సర్వే నివేదికను మరింత వివాదస్పదం చేసింది.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa