ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ గజ్జి కృష్ణ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 03:34 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్దగల జిల్లా కోర్టు పక్క గల్లీలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 6 సీసీ కెమెరాలను బుధవారం పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎసిపి  గజ్జి కృష్ణ,  సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్ద పట్టణంలోని రంగంపల్లి వద్ద 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కాలనీ ప్రజలకు అభినందనలు,ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదే స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కల్పించి, ఇతర ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా  కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాలను, పనిచేసే విధంగా మెయింటెనెన్స్ చేయాలని, సీసీ కెమెరాలను మొబైల్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa