నగరంలోని ఎల్బీనగర్ సెల్లార్ కుంగిన ఘటనపై జీహెచ్ఎసీ సీరియస్ అయ్యింది. భవన నిర్మాణ అనుమతులను బల్దియా రద్దు చేసింది. సెట్ బ్యాక్ లేకుండా అపార్ట్మెంట్ను నిర్మిస్తున్నారని.. బారికేడింగ్, రిటర్నింగ్ వాల్ లేకుండానే సెల్లార్ తవ్వకం జరిగిందని తేలింది. అసలు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు జరిపారని.. ముగ్గురు మృతికి కారణమయ్యారంటూ బిల్డర్పై క్రిమినల్ కేసు పెట్టింది జీహెచ్ఎంసీ. జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జీహెచ్ఎంసీ ఈ కేసు పెట్టింది. అలాగే బిల్డర్కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.ఎల్బీనగర్లోని సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనలో ఓనర్ కుస్మా రమేష్పై 106(1) 125(a) బీఎన్ఎస్ సెక్షల కింద ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు రాము, వీరయ్య, వాసు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించగా.. గాయపడిన బిక్షపతి ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం శరీరంలో అక్కడక్కడ కొన్ని గాయలతో నిలకడగానే బిక్షపతి ఆరోగ్యం ఉన్నట్లు తెలుస్తోంది. పేదవారు కావడంతో కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో బిక్షపతి కుటుంబం ఉంది.
మరోవైపు ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూరైనా మృతదేహాలను ఇవ్వకుండా బిల్డర్ అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa