ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక సూచనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 12:27 PM

తెలంగాణాలో చేపట్టనున్న కులగణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పకడ్బందీగా సర్వే చేశామని, ఇది రీ సర్వే కాదు మిస్‌ అయినవారి కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు కుల గణన సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని.. కొంత మంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం మాత్రమే అని చెప్పారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలు.. అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa