గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మార్చి 3, సోమవారం నాడు, నగరంలోని బస్ స్టాప్లలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ద్వారా 'బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' బస్సుల స్థానాన్ని ట్రాక్ చేస్తుంది . బస్సులు ఏ సమయంలో వస్తాయి.. ఏ సమయంలో వెళ్తాయి అనే వివరాలను అక్కడ ప్రదర్శిస్తుంది. స్థానిక నివేదికల ప్రకారం.. బస్ స్టాప్లలో వేచి ఉన్న ప్రయాణీకులకు బస్సు సమయాలు, దూరాల గురించి తెలియజేయడానికి ఇవి సహాయపడతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన 2,000 కిలోమీటర్లలో సిటీ బస్సులు కనిపిస్తాయి. జీహెచ్ఎంసీ ఆ రోడ్లపై దాదాపు 1,500 బస్ స్టాప్లను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ నగరంలో దాదాపు 3,000 బస్సులను నడుపుతుంది. దాదాపు 20 లక్షల మందికి రవాణాను అందిస్తుంది.
బస్సు లొకేషన్లు , అవి ఏ సమయంలో వస్తాయనే వివరాలను ప్రయాణీకులకు తెలియజేయడానికి బస్ స్టాప్లను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక వేసింది. లండన్లో ఉన్నటువంటి హైటెక్ ఫీచర్లతో షెల్టర్లను నిర్మించడానికి ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది. ఈ ఆధునీకరణలో భాగంగా.. ఇటీవల 248 కొత్త బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులలో జీపీఎస్ ట్రాకర్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని జీహెచ్ఎంసీ, టీజీఎస్ఆర్టీసీ కూడా చర్చించాయి. ఈ జీపీఎస్ పరికరాలను హైదరాబాద్లోని బస్ స్టాండ్లలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులతో అనుసంధానిస్తారు.
జీపీఎస్, డిజిటల్ బోర్డుల స్థాపన అనేది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జరుగుతుందని జీహెచ్ఎంసీ నుండి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రకటనల ద్వారా ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుతాయి. ఈ విధానం ద్వారా నగర ప్రయాణికులకు తక్కువ సమయంలో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ముందుకు వెళ్తోంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తర్వాత ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో పురుషులు ప్రయాణించాలంటే ఇన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదెలా ఉంటే..ఏ సమయంలో బస్సులు వస్తాయో.. ఎఫ్పుడు వెళ్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ సమస్య మహిళలకు.. ఇటు పురుషులకు పెద్ద సమస్యగా మారింది. ఈ విధానం వల్ల సమస్యకు పరిష్కారం లభించినట్లే. బస్సుల నిజ సమయ సమాచారం ప్రదర్శన ద్వారా కలిగే ఉపయోగాల్లో.. ప్రయాణికులకు వేచి చూడాల్సిన సమయం తగ్గుతుంది. బస్ రూట్లు, స్టాప్ల వివరాల ప్రదర్శన ద్వారా తికమక లేకుండా ఉంటుంది. సిటీ ట్రాఫిక్పై ప్రభావాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa