ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 రోజుల్లో 30 మంది బలి..తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:37 PM

తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో జనాలు విలవిల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రజలు పిట్ట పిల్లల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా మరో ఏడుగురు బలవటం బాధాకరం. దీంతో.. గత మూడు రోజుల్లో వడదెబ్బ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరింది. ఈ వరుస మరణాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.


తాజాగా నమోదైన వడదెబ్బ మరణాల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు మరియు జనగామ జిల్లాలో ఒకరు మృతి చెందారు. అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన ఉక్కపోత, వేడి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక సామాన్య ప్రజలు పిట్టల్లా రాలిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


మరోవైపు.. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని, శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు తగినంత నీరు త్రాగాలని, వదులైన దుస్తులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.


శుక్రవారం (ఏప్రిల్ 25) తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..


హైదరాబాద్: 38 డిగ్రీలు


నిర్మల్: 45.2 డిగ్రీలు


ఖమ్మం: 31.6 డిగ్రీలు


కరీంనగర్: 36.7 డిగ్రీలు


వరంగల్: 35 డిగ్రీలు


నల్గొండ: 34.4 డిగ్రీలు


సూర్యాపేట: 34.4 డిగ్రీలు


ఆదిలాబాద్: 36.4 డిగ్రీలు


నిజామాబాద్: 42.8 డిగ్రీలు


మహబూబ్‌నగర్: 33.9 డిగ్రీలు


మంథని: 36.7 డిగ్రీలు


రామగుండం: 41 డిగ్రీలు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa