ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 11:55 AM

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో బలిజ శేఖర్ కిరాణం కొట్టు డబ్బాలో సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దేవుని ఫొటోలకు అగర్ బత్తులు వెలిగించిన తర్వాత షట్టర్ మూసివేసి వెళ్లగా, మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ అంగూరి నవీన్ ధైర్యంగా షట్టర్ తెరిచి, నల్లాల నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు పదివేల విలువైన నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. నష్టపోయిన వ్యాపారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంటలను ఆర్పివేసిన కానిస్టేబుల్ నవీన్ను పలువురు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa