పెనుగొండ శ్రీనగరేశ్వర స్వామి మహిషాసుర మర్దని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 31న నిర్వహించే వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, జేసీ రాహుల్కుమార్ రెడ్డి పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హెలీప్యాడ్ స్థలాలలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం నగరేశ్వర మహిషాసుర మర్ధని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్, ఎస్పీ, జేసీలకు శేషవస్త్రాలను కప్పి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం నిత్యాన్నదాన సత్రం ప్రాంగణంలో ఈనెల 31న హోమం నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వాసవి ధామ్ను సందర్శించి 90 అడుగులు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆలయ సెక్రటరీతో కార్యక్రమాల వివరాలు చర్చించి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బి.భీమారావు, ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, దేవస్థానం అధికారి ఐవీ సుబ్బారావు, తహసీల్దార్ అనిత కుమారి, ఎంపీడీవో మూర్తి, వాసవీధామ్ సెక్రటరీ కె.రాజ, సీఐ ఆర్.విజయకుమార్, ఎస్ఐ గంగాధర్, ఆర్అండ్బీ అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa