ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు నాన్ వెజ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 10:38 PM

నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. అది చికెన్ లేదా మటన్ లేదా చేప అయినా సరే ఓ పట్టు పట్టాల్సిందే. చికెన్ ఫ్రై, మటన్ పులుసు, చేపల పులుసు ఐటమ్ ఏదైనా సరే నాన్ వెజ్ ప్రియులు ఓ పట్టు పడతారు. చికెన్, మటన్, చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే, నాన్ వెజ్ అందరికీ సరిపోదు. చాలా మంది నాన్-వెజ్ తిన్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెబుతారు. ఎలాంటి వ్యక్తులు నాన్ వెజ్ తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


గర్బిణీ స్త్రీలు


గర్భిణీ స్త్రీలు నాన్-వెజ్ తినకూడదు. ఎందుకంటే అందులో కడుపులో ఉన్న బిడ్డకు హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు ఉండవచ్చు. నాన్-వెజ్‌లో అధిక మొత్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇది గర్భిణీ స్త్రీలకు హానికరం. అంతేకాకుండా నాన్ వెజ్ తినడం వల్ల వేడి చేసే ప్రమాదముంటుంది. అందుకే గర్బిణీ స్త్రీలు ఎక్కువ మొత్తంలో నాన్ వెజ్ తినకూడదు.


గుండె జబ్బు ఉన్నవారు


గుండె జబ్బు ఉన్న రోగులు మాంసాహారం తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండెకు హాని కలిగిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా నాన్-వెజ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. వైద్యులు కూడా గుండె రోగులు ఎక్కువ మాంసాహారాన్ని తినవద్దని చెబుతారు. ఎందుకంటే ఇది వారి రక్తానికి మేలు చేయదు.


డయాబెటిక్ రోగులు


మధుమేహ రోగులు నాన్-వెజ్ ఎక్కువ తినకపోవడమే మేలు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా నాన్-వెజ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది, ఇది రక్తపోటును పెంచుతుంది. నాన్-వెజ్ తిన్న తర్వాత, డయాబెటిక్ రోగుల చక్కెర స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. ఇది కొన్నిసార్లు చాలా ప్రాణాంతకం కావచ్చు.


జీర్ణ సమస్యలు ఉన్నవారు


ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు నాన్-వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఎందుకంటే నాన్ వెజ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది.


అలెర్జీ సమస్యలు ఉన్నవారు


అలెర్జీ ఉన్నవారు నాన్-వెజ్ తినకూడదు. ఎందుకంటే ఇందులో అలెర్జీని కలిగించే ప్రోటీన్లు ఉండవచ్చు. అంతేకాకుండా, నాన్-వెజ్‌లో అధిక మొత్తంలో హిస్టామిన్ ఉంటుంది. ఇది అలెర్జీ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. నాన్-వెజ్ తినడం వల్ల మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. చాలా సార్లు చర్మ అలెర్జీలు పెరిగే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com