టీసీఎస్ (TCS) లో ఉద్యోగాల కోత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం (Central Government) గమనిస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం ఈ విషయంపై ప్రభుత్వం కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 12 వేల మందికి పైగా ఉద్యోగాలను తొలగించే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.ఉపాధి సృష్టి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.తొలగింపులపైమంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయినటీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ఉద్యోగులపై పడుతుంది.2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులుజతయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa