ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో క్షామం.. అధికారికంగా ప్రకటించిన ఐరాస

international |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 06:07 PM

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావంతో గాజాలో క్షామం నెలకొంది. ఐక్యరాజ్యసమితి ఐపీసీ తొలిసారి అయిదో దశ హెచ్చరిక జారీ చేసింది. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 59 పేజీల నివేదికలో వెల్లడించింది. ఈ నెలాఖరులోగా దుర్భిక్షం డెయిర్ అల్ బాలాహ్, ఖాన్ యూనిస్ వరకు విస్తరించనున్నట్లు హెచ్చరించింది. అయితే ఈ నివేదిక అసత్యమని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీనిపై యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటెర్ర‌స్ ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa