సెప్టెంబర్ 15 గడువు దగ్గర పడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసుకోవడానికి జియోఫైనాన్స్ కొత్తగా సెన్సేషన్ ఆఫర్తో ముందుకొచ్చింది.కేవలం రూ.24తోనే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ను స్వయంగా ఫైల్ చేసుకునే అవకాశం కల్పించింది.ఈ ఆఫర్ను పొందేందుకు జియోఫైనాన్స్ యాప్లో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన "ట్యాక్స్ ప్లానింగ్ & ఫైలింగ్" ఫీచర్ను ఉపయోగించాలి.అయితే, ఈ రూ.24 ప్లాన్ ఒకే ఫారం-16 కలిగిన జీతభత్యదారులకే పరిమితం. బిజినెస్ ఆదాయం, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్), విదేశీ పెట్టుబడులు వంటి క్లిష్టమైన పన్ను కేసులకు ఇది వర్తించదు. అలాంటి సమర్థవంతమైన సేవల కోసం జియోఫైనాన్స్ రూ.999 ప్రీమియం ప్లాన్ను కూడా అందిస్తోంది.
*ఇతర ప్లాట్ఫారాల ధరలతో పోలిస్తే:
టాక్స్2విన్: బేసిక్ ప్లాన్ – రూ.49, సీఏ సపోర్ట్ ప్లాన్ – రూ.1,274 నుంచి రూ.7,968 వరకు
మైట్రీటర్న్: సెల్ఫ్ ఫైలింగ్ – రూ.199, సీఏ సహాయం – రూ.1,000 నుంచి రూ.6,000 వరకు
టాక్స్ మేనేజర్: ధర – రూ.500 నుంచి ప్రారంభం, సీఏ తో ప్లాన్ – రూ.5,000 వరకు
క్లియర్ టాక్స్: బేసిక్ ప్లాన్ – రూ.2,540, లగ్జరీ ప్లాన్ – రూ.25,000
టాక్స్బడ్డీ: సెల్ఫ్ ఫైలింగ్ – రూ.699, క్లిష్టమైన కేసులకు – రూ.2,999
ఈ వివరాలను పరిశీలిస్తే, జియోఫైనాన్స్ రూ.24 ఆఫర్ అత్యంత చౌకగా కనిపిస్తోంది. అయితే పన్ను నిపుణులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు – "కేవలం ధరను మాత్రమే ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవద్దు. చౌకైన ప్లాన్లలో ప్రొఫెషనల్ సపోర్ట్ లేకపోవచ్చు."
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa