రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే ఆహారం అందించే విధానాన్ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే, ఐఆర్సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ను ఇటీవల తీసుకువచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతో ఎకానమీ మీల్స్ తీసుకు వచ్చాయి. వేసవి సీజన్లో రైళ్లలో అధిక రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు.
దేశవ్యాప్తంగా వందకుపైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ విధానం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ అందిస్తున్నారు. ఎకానమీ మీల్స్లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకం ఎకానమీ భోజనంలో 20 రూపాయలకే ప్రయాణికులకు భోజనం అందిస్తారు. ఇక రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు.
ఈ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఆగేచోట ఫ్లాట్ ఫారమ్లపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మద్య రైల్వేలోని 7 స్టేషన్లలో ఐ.ఆర్.సీ.టి.సీ కిచెన్ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa