కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు తనకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందని పార్థసారధి ప్రశంసించారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉందన్నారు. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలకు ధన్యవాదాలు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa