ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభలో తోపులాట... ప్రధాని క్షమాపణ

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 07:50 PM

నార్త్ 24 పరగణాస్‌లో ఇవాళ బీజేపీ నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్దఎత్తున తోపులాట చోటుచేసుకుంది. కారణంగా మహిళలు, చిన్నపిల్లలు సహా అనేక మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ పట్టుమని పావుగంటలోనే తన ప్రసంగాన్ని కుదించుకోవాల్సి వచ్చింది.
మతువా వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తుండగా... వేదిక వెలుపల ఉన్న వందలాది మంది కార్యకర్తలు సభలో స్త్రీలకు కేటాయించిన ఇన్నర్ రింగ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తోపులాట మొదలయ్యింది. అందరూ తమతమ స్థానాల్లో కూర్చోవాలనీ... వేదిక ముందుకు రావద్దంటూ మోదీ వారించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. తోపులాట కారణంగా గాయపడిన మహిళలు, పిల్లలకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు.
పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి ఆ ప్రాంతంలో పోలీసులు అనేవారు లేకపోవడంతో ఈ తోపులాట జరిగినదని బీజేపీకి నేతలు విమర్శించారు. తదుపరి దుర్గాపూర్ లో జరిగిన బహిరంగసభలో  మాట్లాడుతూ ఠాకూర్ నగర్ సభలో తొక్కిసలాట  జరగడం పట్ల ప్రధాని విచారం వ్యక్తంచేశారు. ప్రజలకు క్షమాపణ తెలిపారు. ఈ సభాస్థలంలో సామర్ధంకన్నా రెట్టింపు మంది ప్రజలు రావడంతోనే ఈ విధంగా జరిగిన్నట్లు పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa