ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంటరిగా ఆటో ఎక్కిన యువతిపై గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 02:19 PM

త్రిపుర రాజధాని అగర్తలాలో 32 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై పడేశారు. ఘటనకు కారణమైన తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురిని త్రిపుర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాధితురాలి భర్త తన ఫిర్యాదు మేరకు .. మంగళవారం రాత్రి తన పిల్లల చికిత్స కోసం అగర్తలాను వచ్చిన మహిళ మంగళవారం సాయంత్రం గోవింద్ బల్లభ్ పంత్ (జిబిపి) ఆసుపత్రి నుండి బయలుదేరి ఆటోరిక్షాలో ఎక్కారు. అయితే ఆటో డ్రైవర్ వేరే దారిలో వెళ్లడంతో ఆమె ప్రశ్నించింది. వేరే చోటకు వెంటనే వెళ్లాల్సి ఉందని ఆ డ్రైవర్ చెప్పడంతో ఆమె ఊరుకుంది. ఆ తర్వాత ఆటోలోకి మరో ఎనిమిది మంది పురుషులు వచ్చారు. ఆ సమయంలో వారు వాహనంలోని బాధితురాలిని నానారకాలుగా హింసించారు. సహాయం కోసం ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమెపై చేయిచేసుకున్నారు. నగరానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో మహిళను ఒక వ్యాన్ వద్దకు తరలించి, సామూహిక అత్యాచారం చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆమెను అపస్మారక స్థితిలో రోడ్డుపై పడివుండటాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యింది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడానికి మూడు పోలీస్ స్టేషన్లకు పరుగెత్తవలసి వచ్చింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి రెండు పోలీస్టేషన్లలోని సిబ్బంది నిరాకరించారు. ఘటనకు కారణమైన వారిని విడిచిపెట్టేదిలేదని, వారికి తగిన శిక్ష పడాలని బాధితురాలి భర్త వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa