ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన రైల్వే ప్లాట్ ఫాం టిక్కెట్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 08:21 PM

నడుస్తున్న రైళ్లలో దొంగలు పడి ప్రయాణికుల సొమ్ము, ఆభరణాలు దోచుకుపోయారనే వార్తలు చూస్తుంటాము. కానీ ఇప్పుడు రైల్వే ప్లాట్ ఫారంపైనే దోపిడి జరుతోంది. అయితే ఈసారి దక్షిణమద్య రైల్వేయే ప్రయాణికులను నిలువు దోపిడీ చేయబోతోంది. దాని పరిధిలో గల విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ల ధరను రూ.10 నుంచి ఒకేసారి ఏకంగా రూ.30కు పెంచేసింది. నేటి నుంచి అక్టోబర్ 11న దసరా పండుగ పూర్తయ్యేవరకు ఈ ధరలు అమలులో ఉంటాయని దక్షిణమద్య రైల్వే ప్రకటించింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దోపిడీ కేవలం ఈ మూడు స్టేషన్లకే పరిమితం కాదు. త్వరలోనే తెలంగాణలో కూడా సికింద్రాబాద్‌తో సహా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోను ప్లాట్ ఫారం టికెట్ల ధరలను పెంచడం ఖాయమని భావించవచ్చు. పండగ రద్దీ కారణంగా రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ట్రైన్లో కూర్చోనేందుకు సీట్లు లభించకపోయినప్పటికీ, రైల్వేశాఖ టికెట్ ధరలో ఎటువంటి తగ్గింపు ఇవ్వదు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa