ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను సాగిస్తున్నాడు. అయితే ముందు నుంచి పార్టీనీ నమ్ముకున్న నేతలకు, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ వస్తున్నాడు.
అయితే తాజాగా సినీ నటుడు మోహన్ బాబుకు కీలక పదవిని కట్టబెట్టాలని జగన్ డిసైడయ్యారట. అయితే ఇప్పటికే ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవిని నటుడు పృధ్వీకి కట్టబెట్టగా, తాజాగా లక్ష్మీ పార్వతికి ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాడు. అయితే వచ్చే సంవత్సరం రాజ్యసభ ఎంపీ ఖాళీ అవ్వనుండడంతో ఆ పదవికి మోహన్ బాబును నామినేట్ చేయాలని అనుకుంటున్నట్టుగా పార్టీలో ఈ మేరకు చర్చలు నడుస్తున్నాయట. అయితే గతంలో మోహన్ బాబు ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు తిరిగి మళ్ళీ అదే అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుందని సీఎం జగన్ నిశ్చయించుకున్నారట. అయితే ఒక వేళ జగన్ ఆ పదవి మోహన్ బాబుకు కనుక కట్టబెడితే ఇక ఆయన పూర్తిగా ఢిల్లీ రాజకీయాలకే పరిమితం కావలసి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa