ఎన్ఆర్సీ కావాలా వద్దా అన్న అంశంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అధికారక ప్రకటన చేయాలని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఎన్ఆర్సీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి అధికారి ప్రకటనను షేర్ చేయాలని ఆయన ఆ పార్టీని కోరారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినా, దాన్ని ఆపలేకపోయామన్నారు. కానీ ఎన్ఆర్సీని అడ్డుకోవాలంటే, ఆయా రాష్ట్రాలు నో చెప్పాలని, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీనిపై ఎటువంటి ప్రకటన చేయాలనుకున్నా, దాన్ని స్పష్టంగా చెప్పాలని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ సీఎంలు చెప్పిన విషయాన్ని కాకుండా, పార్టీ అధ్యక్షురాలు తన ప్రకటనను వెల్లడించాలని కిషోర్ చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న వారికి రాహుల్ అండగా నిలవడం సంతోషకరమని, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టబోమని ఆ పార్టీ అధ్యక్షరాలు స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రశాంత్ కిషోర్ తన ట్విట్టర్లో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa