ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలపై దుండగుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 05:10 PM

కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించిన టీడీపీ నేతల బృందంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఏడుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. అసలేం జరిగిందంటే.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలియడంతో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ నేతృత్వంలోని బృందం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించింది. అటు నుంచి తిరిగి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఆల్ఫా హోటల్ వద్ద టీ సేవిస్తుండగా కొందరు దుండగులు వచ్చి దాడి చేశారు. టీడీపీ నేత సజ్జా అజయ్‌పై ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. అయితే వైసీపీ నేతలే తమపై దాడి చేశారని ఇబ్రహీపట్నం పీఎస్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆల్ఫా హోటల్ వద్ద సీపీ టీవీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇదే విషయమై విజయవాడ సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని పట్టాభి బృందం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa