వాషింగ్టన్: అగ్రదేశాధినేతలు పుతిన్, ట్రంప్ రహస్యంగా కలుసుకున్నారు. ఇటీవల హాంబర్గ్లో జరిగిన జీ20 దేశాల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య రెండవ సారి రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఈ ఇద్దరూ ఓ గంట పాటు చర్చలు నిర్వహించినట్లు కూడా తెలుస్తున్నది. ఈ విషయంపై ఇప్పటివరకు వైట్హౌజ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే పుతిన్తో సీక్రెట్ డిన్నర్ చేశారా అన్న ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. అదో ఫేక్ న్యూస్ అన్నారు.
గత ఏడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ విక్టరీ కోసం రష్యా సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోపణలను రష్యా, ట్రంప్ ఇప్పటికే ఖండించారు. అయితే హాంబర్గ్లో రెండవ సారి ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడం పట్ల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుతిన్ ఆయన ట్రాన్స్లేటర్తో ట్రంప్ను ఒంటరిగా కలుసుకున్నట్లు తెలుస్తున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa