గుంటూరు మీదగా మరో కొత్త రైలు ప్రారంభమైంది. నెంబరు. 06577 యశ్వంత్పూర్ - గువహటి - యశ్వంత్పూర్ వీక్లీ వారంలో ఒకరోజు రైలుని శనివారం గుంటూరు లో రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ రైలు ఇక నుంచి ప్రతీ శుక్రవారం రాత్రి 10. 40 గంటలకు యశ్వంత్పూర్లో బయలుదేరి శనివారం ఉదయం 6. 05కి నంద్యాల, 7. 58కి మార్కాపురం రోడ్, 9. 16కి నరసరావుపేట, మధ్యాహ్నం 12. 10కి గుంటూరు, రాత్రి 7. 30కి దువ్వాడ, సోమవారం ఉదయం 6 గంటలకు గువహటి చేరుకొంటుంది.
నెంబరు. 06578 గువహటి - యశ్వంత్పూర్ వీక్లీ రైలు సోమవారం రాత్రి 7. 35 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12. 05కి గుంటూరు, 12. 55కి నరసరావుపేట, 2. 15కి మార్కాపురం రోడ్డు, సాయంత్రం 6. 05కి నంద్యాల, గురువారం వేకువజామున 4. 30కి యశ్వంత్ఫూర్ చేరుకొంటుంది. జూన్ నెలాఖరు వరకు ఈ రైలుని ప్రత్యేక ఎక్స్ప్రెస్గా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa