నంద్యాల ఉప ఎన్నికపై తమ టీమ్ పరిశీలన జరిపి, టీడీపీ విజయం ఖాయమని తెలిపిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఇది తమ టీమ్ అభిప్రాయమని ఆయన తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలు కాక ముందు, ఆ తర్వాత, పోలింగ్ జరిగిన రోజున తమ సభ్యులు నంద్యాలలో సర్వే జరిపారని... ఇవన్నీ జరిగిన తర్వాతే గెలుపు ఎవరిదనే విషయాన్ని తనకు తెలియజేశారని పేర్కొన్నారు. టీడీపీ గెలుపు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, తన టీమ్ అంచనా మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నిక కావడంతోనే నంద్యాల ఉప ఎన్నికకు ఇంతటి ప్రచారం లభించిందని అన్నారు. పోలింగ్ ముగిశాక ఓటింగ్ సరళిపై ఆయన మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందనడం సరికాదన్నారు. పోలింగ్ శాతం పెరిగినా టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని తెలిపారు. గురువారం నాటికి మెజారిటీపై స్పష్టత వస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. టీడీపికి 17,333 ఓట్ల మెజారిటీ రావచ్చని ఇది 15 వేలైనా కావొచ్చు లేదా 20 వేలకైనా వెళ్లొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్ శాతం పెరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa