ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరాయి వ్యక్తి మోజులో భార్య.. భర్త ఏం చేశాడంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 04:13 PM

పెళ్లై తొమ్మిదేళ్లయినా పరాయి వ్యక్తి మోజులో పడిన భార్యను భర్త ఉరివేసి చంపేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. గుత్తి మండలం ఊటకల్లుకు చెందిన జగ్గలేటి జనార్దనయ్యకు యాడికి మండలం పెద్దపేటకు చెందిన నీలావతితో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన 3 నెలలకే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం జనార్ధనయ్యకు తెలిసింది. అతను తన భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుసార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. అయినా నీలావతి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఇంకా వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2 రోజుల తర్వాత భార్యను తీసుకొచ్చిన జనార్దనయ్య ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించాడు. నీలావతి అతడితో గొడవ పడింది. సహనం కోల్పోయిన జనార్దనయ్య.. భార్య మెడకు ఆమె చున్నీని బిగించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.


ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనార్దనయ్యను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. క్షణికావేశంలో తానే తన భార్యను హత్య చేసినట్లు జనార్దనయ్య ఒప్పుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa