పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 10 కి చేరుకుంది పూర్తిస్థాయిలో ప్రమాదానికి సంబంధించిన నివేదికను ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ప్రస్తుతం సహాయక చర్యల్లో పోలీసులు రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు ఘటనా స్థలం నుండి 22మంది క్షతగాత్రులను 108 వాహనాల్లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రాహుల్దేవ్ శర్మ ఘటనాస్థలానికి కొద్దిసేపట్లో చేరుకోనున్నారు అలాగే ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఘటనా స్థలానికి ఏలూరు నుండి బయలుదేరారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్ ఆర్డిఓ ప్రసన్న లక్ష్మి లు ప్రస్తుతం అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa