ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఓటమి...ఎగతాళి నన్ను బాధించాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 08:32 PM

కుప్పంలో రెండు ఘటనలు బాధించాయని. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు, కుప్పంలో ఓటమిపై చేసిన ఎగతాళి ఎంతగానో తనను బాధపెట్టాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలికారు. దేవరాజపురంలో భారీ ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికి నియోజకవర్గంలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు గ్రామాల్లో ఆయన పర్యటించి.. కార్యకర్తలు, ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. " రౌడీయిజం చేయడం ఒక్క నిమిషం పని.. కానీ అది మన విధానం కాదు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా.. అందరి లెక్కలు తేల్చుతాం.. నన్ను కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారు. నేను కుప్పం ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి నేను ఎక్కడికి పోనూ.. పార్టీలోని కోవర్టును పంపిచేస్తా.. కుప్పంలో ప్రక్షాళన చేస్తా అవతలి వాళ్లు కుప్పంపై హేళన చేస్తుంటే నాకు బాధ కలిగిస్తుంది. కుప్పంలో ఇకపై కార్యకర్తలు ఎలా చెప్తే అలా చేస్తా" అని చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో రెండు ఘటనలు బాధించాయని. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు, కుప్పంలో ఓటమిపై చేసిన ఎగతాళి ఎంతగానో తనను బాధపెట్టాయని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. కుప్పం అభివృద్ధి గురించే తాను ఆలోచిస్తున్నానని.. కుప్పంలో కార్యకర్తల ఇష్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానంటూ చంద్రబాబు మాట ఇచ్చారు. కుప్పంలో కార్యకర్తలు వద్దన్న నేతలు, నష్టం చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 'నేను నియోజకవర్గం మార్చాలా.. ఆ అవసరం ఉందా..నేను కుప్పానికి ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి ఎక్కడికీ పోనూ. అవతలివాళ్లు కుప్పంపై హేళన చేస్తే నాకు బాధ కలిగించింది. కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ను సభలో చూడాలని జగన్ అన్నాడు.చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా!' చంద్రబాబు ప్రశ్నించారు. మళ్లీ సీఎంగానే శాసనసభకు వెళ్తానని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంపై తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవంగా ఉన్నారు.. ఇక్కడ జగన్ ఎలా ఉన్నారు అనేది ప్రజలే చూసుకోవాలన్నారు. పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa