కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీలో చిచ్చురేపుతోంది. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని, రెవెన్యూ డివిజన్ కేంద్రం యథావిధిగా కొనసాగాలని కోరుతూ స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, కందుకూరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు వినతి అందించారు. ఈ మేరకు శనివారం వారంతా కలెక్టర్ను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మహీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తే కందుకూరు ప్రాంత వాసుల రాకపోకలకు దూరమవుతుందన్నారు. 40 కిలో మీటర్ల దూరంలో ఉండే ఒంగోలును కాదని.. 120 కిలో మీటర్ల ఉంటే నెల్లూరులో కందుకూరు నియోజకవర్గాన్ని కలపడం దారుణమన్నారు. అధికారులు చేసిన చిన్న పొరపాటు తమ ప్రాంతానికి గొడ్డలిపెట్టుగా మారిందని చెప్పారు. కందుకూరు డివిజన్ కొనసాగింపు అలాగే ప్రకాశం జిల్లా లోనే కందుకూరు ను ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే మహీధర రెడ్డి నేతృత్వం లో 12:00 గంటల కి కలెక్టరు ను కలిసి , మీడియాతో మాట్లాడుతున్న కందుకూరు శాసన సభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..కందుకూరు నియోజకవర్గం గతంలో నెల్లూరు జిల్లాలోనే ఉండేదని.. ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వివరించారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లాలోనే కందుకూరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లామని, త్వరలో కలవనున్నట్లు తెలిపారు. అలాగే రామాయపట్నం పోర్టు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఉపయోగపడనున్న నేపథ్యంలో కందుకూరును యథావిధిగా ఉంచేందుకు జిల్లా ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యే మహీధర్ వెంట పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa