ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు దేశాల యుద్దం ఫలితం...మళ్లీ వాహనదార్లపై ధరల మోత

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 12:19 PM

ఇప్పటికే ధరల పెరుగుదలతో చుక్కలు చూస్తున్న భారతీయులకు మరోసారి ప్రెటోల్ బాదుడు  మొదలుకానున్నది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ 100 డాలర్లకు పైకి చేరుకుంది. ఈ సంక్షోభం దేశీయంగా కూడా పడటం ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో ప్రధాన నగరాలలో ధరలను ప్రస్తుతం పెంచనప్పటికీ.. కాని కొన్ని ప్రాంతాలలో మాత్రం ధరలు మారాయి. విజయవాడ, లక్నో, నోయిడాతో పలు నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చాయి. ఇలా కొన్ని ప్రాంతాలలో ధరలు నేడు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధానమైన మెట్రో నగరాలలో ఆయిల్ కంపెనీలు గత నాలుగు నెలలుగా ధరలను మార్చలేదు. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర అత్యంత గరిష్టంగా సుమారు రూ.110 స్థాయిల వద్ద ఉంది.


దేశంలోని పలు ప్రాంతాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు(లీటరుకు..) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.20గా, లీటరు డీజిల్ ధర రూ.94.62గా ఉంది. అయితే విజయవాడలో పెట్రోల్ ధర 16 పైసలు పెరిగింది. ధర రూ.111.14కు చేరుకుంది. అలాగే లీటరు డీజిల్ ధరపై 15 పైసలు పెరిగి రూ.97.15గా నమోదైంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.41గా, లీటరు డీజిల్ ధర రూ.86.67గా నమోదైంది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.100.58గా, లీటరు డీజిల్ ధర రూ.85.01గా ఉంది. ముంబైలో పెట్రోల్ రేటు రూ.109.98గా, లీటరు డీజిల్ రేటు రూ.94.14గా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.101.40గా, లీటరు డీజిల్ రేటు రూ.91.43గా నమోదైంది. లక్నోలో లీటరు డీజిల్ ధర 02 పైసలు తగ్గి రూ.86.78కి, లీటరు పెట్రోల్ ధర రూ.95.25కి దిగొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa