ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై...ఆ అధికారిణిపై కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 03:28 PM

కొన్నిసందర్భాలలో రాజకీయ వివాదాలలోకి ప్రభుత్వ ఉన్నాధికార్లు లాగబడుతున్నారు. తాజాగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లాపై పూణె పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ ఫోన్‌ను ఆమె ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు అధికారులు శనివారం వెల్లడించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885‌లోని సెక్షన్ 26 కింద ఈ కేసు నమోదైంది. "అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ కేసులో రష్మీ శుక్లాపై ఇక్కడి బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపై ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 కింద కేసు నమోదు చేయబడింది" అని అధికారి తెలిపారు. ప్రస్తుతం శుక్లా హైదరాబాద్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2022లో రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 2015 నుంచి 2019 మధ్యకాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనలపై విచారణ జరిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ పాండే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఈ కమిటీ అందజేసిన నివేదిక ప్రకారం రష్మీ శుక్లాపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. 2016-2017 మధ్య కాలంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ కేసులో అంజాద్ ఖాన్ అనే వ్యక్తి పాల్గోన్నాడనే సాకుతో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని గత ఏడాది నానా పటోల్ ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు కేంద్ర మంత్రి రోసాహెబ్ దాన్వే వ్యక్తిగత సహాయకుడు, అప్పటి బీజేపీ ఎంపీ సంజయ్ కకడే, ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారని పటోలే ఆరోపించారు. ఆ సమయంలో పూణే నగర పోలీస్ కమిషనర్‌గా శుక్లా ఉన్నారు. అప్పుడే ఆమె ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. శుక్లా ఎస్‌ఐడీకి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం శుక్లా హైదరాబాద్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa