ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరగనున్న వంటనూనె ధరలు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 06:08 PM

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్‌పైనా గణనీయంగా పడనుంది. దేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తయిన తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు ఆకాశాన్నంటుతాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ కోవలో వంట నూనె ధరలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ నూనెను విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏటా 2 నుంచి 3 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ నూనె విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది. అందులో 70 శాతం ఉక్రెయిన్ నుంచే ఉంటోంది. ఇప్పటికే యుద్ధ ప్రభావం వల్ల ఉక్రెయిన్ నుంచి వంటనూనె సరఫరా నిలిచిపోయింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే మరిన్ని వస్తువుల ధరలు చుక్కలను అంటుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ట్రేడర్లు వాటిని నిల్వ చేసుకున్నారని, కృత్రిమ డిమాండ్ సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa