మహా శివరాత్రిని పురష్కరించుకొని మండలంలోని శెట్టిపల్లి పంచాయతీ తిమ్మాడపల్లి ఆంజినేయస్వామి ఆలయ ప్రాంగణంలో నేడు ఉట్లపరుషను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కుమారస్వామి రెడ్డి, గంగాధరరెడ్డి, సర్పంచ్ చామంతి, ఎంపీటీసీ జగన్మోహనరెడ్డిలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా శివరాత్రి సందర్భంగా ఉట్లపరుషను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా పరుషను నిర్వహిస్తున్నామన్నారు. ఆలయంలో వెలసిన ఆంజినేయస్వామికి ఆకుపూజ, అంటపూజలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉట్లమాను కొట్టే కార్యక్రమంతో పాటు రాత్రికి రామాయణ తోలుబొమ్మలాట ప్రదర్శిన ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో స్వామి వారికి తిమ్మాడపల్లి గ్రామస్తులు జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి దర్శనం చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa