స్టాక్ మార్కెట్ కు మహర్థశపట్టుకొన్నట్లుంది. స్టాక్ మార్కెట్లు సోమవారం మంచి లాభాలను పండించాయి. ఆఖరిలో అద్భుతమైన రికవరీ సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 387 పాయింట్లు పెరిగి 56,206.38 స్థాయిల వద్ద ముగిసింది. అలాగే సెన్సెక్స్ మిడ్క్యాప్ ఇండెక్స్ 203 పాయింట్లు వరకు జంప్ చేసి 23,366.10 స్థాయిలకు ఎగిసింది. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 220 పాయింట్లు లాభపడింది. ఈ ఇండెక్స్ 26,670.98 వద్ద క్లోజైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 120 పాయింట్లు పెరిగి 16,778.45 వద్ద, బ్యాంకు నిఫ్టీ 235 పాయింట్లు ఎగిసి 36,195.75 వద్ద ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్.. ఇండియన్ ఆర్మీ కోసం టీ-90 ట్యాంకులకు చెందిన కమాండర్ సైట్ రెట్రో మాడిఫికేషన్ కోసం బీఈఎల్, రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.1075 కోట్లుగా ఉంది. 957 ట్యాంకుల రెట్రో మాడిఫికేషన్ను బీఈఎల్ చేపడుతోంది. మేకిన్ ఇండియాకు ఇవి మరింత బూస్టప్ ఇవ్వనున్నాయి. మేకిన్ ఇండియా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దేశీయ రక్షణ తయారీకి ఇవి బూస్టప్ ఇవ్వడమే కాకుండా.. అడ్వాన్స్డ్ టెక్నాలజీల ఎగుమతులకు సరికొత్త ద్వారాలను తెరవనుంది. జెన్ టెక్నాలజీస్.. రూ.13.50 కోట్ల విలువైన డిఫెన్స్ ట్రైనింగ్ ఇక్విప్మెంట్ను సరఫరా చేసేందుకు జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎగుమతులు కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ కంపెనీ అత్యాధునిక రక్షణ శిక్షణ సొల్యుషన్స్ను, డ్రోన్లను, యాంటీ డ్రోన్ల సొల్యుషన్స్ను అందివ్వడంలో ప్రముఖ సంస్థగా, మార్కెట్ లీడర్గా ఉంది. రక్షణ శిక్షణలో సూచనలు ఇవ్వడంలో ట్రైనింగ్ సిస్టమ్స్ను ఇది డెవలప్ చేస్తూ.. ఈ రంగంలో ట్రాక్ రికార్డును నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.428.56 కోట్లుగా ఉంది.
నేటి టాప్ గెయినింగ్ స్టాక్స్..
నిఫ్టీ 50 ఇండెక్స్లో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్లు పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో టైటాన్, రిలయన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకులు లాభాలు పండించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa