ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 174 పరుగులకి ఆలౌట్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 01:26 PM

మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల ఆధిక్యం భారత్‌కు లభించింది. ఓవర్ నైట్ స్కోరు 108 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక 66 పరుగులు మాత్రమే సాధించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. ఆ జట్టులో నిస్సంక 61 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్‌లోనూ 175 పరుగులు చేసి రాణించిన విషయం తెలిసిందే. మిగిలిన భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa